40.2 C
Hyderabad
May 2, 2024 17: 58 PM
Slider నల్గొండ

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

#Ambedkar Jayanti

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తిలక్ నగర్ అంబేద్కర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు కోల్లపూడి యోహాను ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి,వైస్ చైర్ పర్సన్ జక్కుల నాగేశ్వరరావు,15వ,వార్డు కౌన్సిలర్ కోట నరసింహారావు(కెఎల్ఎన్) 14వ,వార్డు కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి వెంకటేష్ పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని దేశం గర్వించేలా ప్రతి పౌరునికి సమ న్యాయం జరిగేలా కుల మతాలు,జాతులు అందరూ సమానులే అని సమాజంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కును కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అతిథులకు సన్మానం చేశారు.


ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు తుమ్మకొమ్ము యోనా,మాదా ఏసు,మామిడి ఇమ్మానియేల్,కుడితొట్టి ఇర్మియ,కోల్లపూడి ఏసురత్నం,దగ్గుపాటి బాబురావు,కోల్లపూడి డేవిడ్,అంగన్వాడి టీచర్ ఇట్టిమల్ల రేణుక,మామిడి బెంజి, ఇశ్రాయేలు,యాకోబు,కోల్లపూడి శ్యామ్, నూకతొట్టి ప్రమోద్,కోల్లపూడి రవి,రమేష్. కోల్లపూడి జాన్ వెస్లీ,రాగి నిఖిల్,పండు. పేతురు,నాగార్జున,శివనేని అబ్రహం,దినేష్. విక్రమ్,చింతమల్ల ప్రసాద్,సతీష్,ఏసు, తుమ్మకొమ్మ రోజమ్మ,మామిడి నేలమ్మ, కోల్లపూడి పద్మ,జ్యోతి,కుమారి,దగ్గుపాటి జ్యోతి, మకోల్లపూడి హేమలత,బయమ్మ, ,లలితమ్మ,కాంతమ్మ,సూర్యమ్మ, ఆపిరమ్మ,రేవతి,సుగుణ,నాగేంద్ర,శ్రీవిద్య, భాగ్యమ్మ,కమల,సుబ్బు,మరియమ్మ, స్వప్న,100కు పైగా మహిళలు,యువకులు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.


సత్యం న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్

Related posts

పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Satyam NEWS

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

Satyam NEWS

లీక్ అయిన పాక్ ప్రధాని ఆడియో టేప్ లు

Satyam NEWS

Leave a Comment