అన్నమయ్య జిల్లా రాజంపేట లో బీజేపీ పార్లమెంటరి కార్యాలయంలో శనివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ పార్టీ పై నేతల పై ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేటలో వైసీపీ నేతలు అయింట్ మెంట్ జాబ్ మేళాలు నిర్వహించారని ఎద్దేవా చేశారు.కాలేజి వారు నిర్వహించిన జాబ్ మేళాను వైసీపీ వారు జబ్బలు చరుచుకుంటూ వైసీపీ జాబ్ మేళాలుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.
నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చారంటే నిరుద్యోగం రాష్ట్రంలో ఎంత పెద్ద సంఖ్యలో ఉందో అర్ధం ఔతోందని అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వంత జిల్లా కడప కు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇండ్లకు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లను ప్రజలు దిష్టి బొమ్మలా వాడుకుంటున్నారని,స్టిక్కర్లను చూసి విశ్వాసం గల కుక్కలు ఓర్చు కోవడం లేదని,చిన్న పిల్లలు కూడా భయబ్రాంతులు ఔతున్నారని ఎద్దేవా చేశారు.
వలసలు జరుగకుండా సాగు,త్రాగు నీరు అందించే అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయేలా చేశారని,రాజంపేట అభివృద్ధిని అన్నీవిధాల అడ్డుకున్నారని ఆరోపించారు. ఇంకా ఈ సమావేశంలో బీజేపీ నేతలు సునీతా ఆది నారాయణ వర్మ,లక్షుమ్మయ్య నాయుడు, నాగరాజు తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు.