40.2 C
Hyderabad
April 28, 2024 17: 26 PM
Slider నల్గొండ

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

#buildingworkers

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభల పోస్టర్  ఆవిష్కరించారు.ఏఐటియూసి జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 3,4వ, తేదీలలో హైదరాబాద్ లో జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర 3వ,మహాసభలు విజయవంతం  చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

కేంద్ర 4 వ్యతిరేక చట్టాలు తెస్తే  రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని,కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా బడా పెట్టుబడిదారులకు కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని అన్నారు.భవన నిర్మాణ కార్మికుల సమగ్ర కార్మిక చట్టాలను రూపొందించి వారి హక్కులను కాపాడుటకు,వారి సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలు చర్చించి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జెట్టి ప్రసాద్,జిల్లా కమిటీ సభ్యులు ముడుసు పాపారావు,బండి భాస్కర్,జక్కుల రమేష్, గుండెబోయిన వెంకన్న,సల్వాది కనకయ్య, జక్కుల రమణ, ఎన్.వెంకటేశ్వర్లు, జక్కుల వెంకటేశ్వర్లు,జి.తేజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మహారాష్ట్ర బస్సులో మంటలు – 25మంది మృతి

Satyam NEWS

మాస్కులు ధరిద్దాం.. కరోనాను ఎదుర్కొందాం

Satyam NEWS

గద్వాల ఎమ్మెల్యే ఇంటింటి భిక్షాటన

Sub Editor

Leave a Comment