29.7 C
Hyderabad
May 4, 2024 05: 37 AM
Slider కడప

అంబేద్కర్ విగ్రహానికి పవన్ కళ్యాణ్ విగ్రహానికి పాలాభిషేకం….

#Ambedkar

అన్నమయ్య జిల్లా నందలూరు బస్ స్టాండ్ లో శనివారం రాజంపేట నియోజకవర్గ జనసేన నేతలు బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.

ఎపి బచావో, వైవీప్ హఠావో,హలో ఎపి బైబై వైసీపీ,ఈ సందర్భంగా జనసేన ఉమ్మడి కడప జిల్లా పోగ్రామ్ కమిటీ కార్యవర్గ సభ్యులు గురివి గారి వాసు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కేవలం కొందరి తప్పు చేసిన వాలంటీర్ల ను విమర్శిస్తే దాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేసి రాద్దాంతం చేయిస్తు న్నారని ఆరోపించారు.

మీడియాలో వాలంటీర్ల పై వచ్చిన ఆరోపణలను మాత్రమే తమ నాయకుడు ప్రస్తావించారని అన్నారు.వైసీపీ నేతలు వాలంటీర్ల గురించి ఎంత చులకనగా మాట్లాడారో అందరికి తెలుసన్నారు.డిగ్రీ,పీజీ, చేసిన వారు వాలంటీర్లు గా 5 వేల జీతానికి పనిచేస్తున్నారని, ప్రభుత్వం వారి శ్రమను దోపిడీ చేస్తోందని గతంలో పవన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాజంపేట ను జిల్లా కాకుండా చేయడమే కాకుండా,మెడికల్ కాలేజీని మదన పల్లెకు తరలించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ను కాకుండా పవన్ కళ్యాణ్ ను డౌన్ డౌన్ అనడం దారుణ మన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పలువురు పాల్గొన్నారు…

Related posts

పెంచిన పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలపై కాంగ్రెస్ పార్టీ నిరసన….

Satyam NEWS

శ్రీనివాస్ గౌడ్ కేసులో పోలీస్లపై కోర్టు ఆగ్రహం

Bhavani

ఏపిలో హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్ర

Satyam NEWS

Leave a Comment