కడప జిల్లా నందలూరు పెట్రోల్ బంకు వద్ద కాంగెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల పై నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాహనాల యజమానులకు కరపత్రాలు పంచి,సంతకాల సేకరణ చేశారు. బ్యానర్ చేత పట్టి కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసులు మాట్లాడుతూ వెంటనే పెంచిన పెట్రోల్, డీజల్ ,గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
పార్టీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసన ఉధృతం చేస్తామని అన్నారు.