32.2 C
Hyderabad
May 2, 2024 01: 08 AM
Slider ముఖ్యంశాలు

నేరాంద్రప్రదేశ్ గా మారిన ఆంధ్రప్రదేశ్

chandrababu

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వ్యవస్థలు చేస్తున్న హత్యలకు బడుగులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం నేరం మోపి పోలీసులు వేధించడంతో నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు.

ఏ పోలీసులు అయితే వేధిస్తున్నారని 2020 నవంబర్‌లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందో… అదే పోలీస్ స్టేషన్ అధికారుల వేధింపుల కారణంగా నేడు చిన్న బాబు రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవడం విషాదకరం అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

రక్షణ ఇవ్వాల్సిన పోలీసుల వల్లనే ప్రాణాలు పోయే పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారు అని మండిపడ్డారు. నంద్యాల ఘటనలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

Related posts

The Power House: కరెంటు కష్టాలకు చరమగీతం  పాడిన రాష్ట్రం

Satyam NEWS

బాలకృష్ణ ఇంటి వద్ద భారీగా పోలీస్ ల మొహరింపు

Satyam NEWS

నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టండి

Satyam NEWS

Leave a Comment