27.7 C
Hyderabad
May 14, 2024 05: 01 AM
Slider నల్గొండ

మేం పాస్ లు ఇచ్చినా ఏపి అనుమతించడం లేదు

#Nalgonda SP Ranganath

ఆంధ్రా తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టు వాడపల్లి వద్ద తాజా పరిస్థితులను నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ మిర్యాలగూడ శాసనసభ్యుడు భాస్కర్ రావుతో కలిసి సమీక్షించారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రా ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి తాము అనుమతులు ఇచ్చామని కానీ ఏ.పి. పోలీసులు ఎవరిని అనుమతించడం లేదని ఆయన చెప్పారు.

తమ పరిధిలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించడానికి తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. ప్రయాణికులు తమతో సహకరించాలని ఎస్పీ కోరారు. ఎస్పీ వెంట మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సిఐ రమేష్ బాబు, ఆర్.ఐ.లు ప్రతాప్, స్పర్జన్ రాజ్, నర్సింహా చారి తదితరులున్నారు.

Related posts

రాష్ట్రంలో సైకో పాలన పోయే సమయం వచ్చింది

Satyam NEWS

పదహారేళ్ళ బాలికపై చర్చి పాస్టర్ అత్యాచార యత్నం

Satyam NEWS

బొబ్బ‌లి,నెల్లిమ‌ర్ల‌లోనే టీడీపీ గ‌ట్టిగా ప‌ని చేసింది..

Satyam NEWS

Leave a Comment