విజయనగరం జిల్లాలో ఎన్నికల పరిశీలకులుగా పార్టీ అధిష్టానం తనను, కే.ఏ.నాయుడులను నియమించిన మున్సిపాలిటీలలో మాత్రమే టీడీపీకి కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయని మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి నియోజక వర్గ ఇంచార్జ్ మీసాల గీత అన్నారు.
నగరంలో కంటోన్మెంట్ లో ప్రత్యేకంగా పెట్టిన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమెతో పాటు కే.ఏ.నాయుడులు మాట్లాడారు. జరిగిన మున్సిపాలిటీలలో పార్టీ పరంగా తలెత్తిన లోపాలను గుర్తించి..విశ్లేషించి…తదనుగుణంగా ముందుకు వెళతామన్నారు.
నాయకత్వం లోపం ,సమిష్టి భావన లేకపోవడం ,పని చేసే నేతలను గుర్తించకపోవడం వలన..జిల్లా ఘోరంగా పార్టీ ఓడిపోయిందన్నారు. ప్రజలే దేవుళ్లు…సమాజమే దేవాలయం అని పార్టీ వ్యవస్థాపక నేత,మాజీ ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ప్రస్తుతం జిల్లాలో పార్టీని ఆరకంగా ఎవ్వరూ చూడటం లేదన్నారు.
మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలు…నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని లోపం ఎక్కడుందో దిద్దుకునే యత్నం చేసి..పార్టీని మరింతగా ముందుకు తీసుకు వెళతామని..మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. ఈ మీడియా సమావేశంలో గీతతో పాటు కొండపల్లి అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు.