29.7 C
Hyderabad
April 29, 2024 08: 06 AM
Slider విజయనగరం

బొబ్బ‌లి,నెల్లిమ‌ర్ల‌లోనే టీడీపీ గ‌ట్టిగా ప‌ని చేసింది..

#TDPVijayanagaram

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  ఎన్నిక‌ల ప‌రిశీల‌కులుగా  పార్టీ అధిష్టానం తనను, కే.ఏ.నాయుడుల‌ను నియ‌మించిన మున్సిపాలిటీలలో మాత్ర‌మే టీడీపీకి కాస్త మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి నియోజ‌క వ‌ర్గ ఇంచార్జ్ మీసాల గీత అన్నారు.

న‌గ‌రంలో కంటోన్మెంట్ లో ప్ర‌త్యేకంగా పెట్టిన పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆమెతో పాటు కే.ఏ.నాయుడులు మాట్లాడారు. జ‌రిగిన మున్సిపాలిటీల‌లో పార్టీ ప‌రంగా త‌లెత్తిన లోపాల‌ను గుర్తించి..విశ్లేషించి…త‌ద‌నుగుణంగా ముందుకు వెళ‌తామ‌న్నారు.

నాయ‌క‌త్వం లోపం ,స‌మిష్టి భావ‌న లేక‌పోవ‌డం ,ప‌ని చేసే నేత‌ల‌ను గుర్తించ‌క‌పోవ‌డం వ‌ల‌న‌..జిల్లా ఘోరంగా పార్టీ ఓడిపోయింద‌న్నారు. ప్ర‌జ‌లే దేవుళ్లు…స‌మాజ‌మే దేవాల‌యం అని పార్టీ వ్య‌వ‌స్థాప‌క నేత‌,మాజీ ముఖ్య‌మంత్రి చెప్పిన విధంగా ప్ర‌స్తుతం జిల్లాలో పార్టీని ఆర‌కంగా ఎవ్వ‌రూ చూడ‌టం లేద‌న్నారు.

మొన్న జ‌రిగిన పంచాయితీ ఎన్నిక‌లు…నిన్న జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బేరీజు వేసుకుని లోపం ఎక్క‌డుందో దిద్దుకునే య‌త్నం చేసి..పార్టీని మరింత‌గా ముందుకు తీసుకు వెళ‌తామ‌ని..మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. ఈ మీడియా స‌మావేశంలో గీత‌తో పాటు కొండ‌ప‌ల్లి అప్ప‌ల‌నాయుడు కూడా పాల్గొన్నారు.

Related posts

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో కార్తీకమాస పూజలు

Bhavani

రెగ్యులేషన్: నియంత్రిత సాగు విధానంపై 21న విస్తృత సమావేశం

Satyam NEWS

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : అదనపు ఎస్పీ నర్మద

Satyam NEWS

Leave a Comment