సూర్యాపేట హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం పోషణ అభియాన్ పోషణ మహోత్సవ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి హాజరైనారు.
శానంపూడి సైదిరెడ్డి పోషణ మహోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేసించి మాట్లాడుతూ అమ్మలా గర్భిణులకు పోషకాహారం అందిస్తున్న అంగన్వాడీ టీచర్లకు వేతనం ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే గౌరవప్రదమైన వేతనాన్ని సిఎం కెసిఆర్ నేతృత్వంలో అందిస్తున్నామని అన్నారు.
గతంలో అంగన్వాడి టీచర్లకి ఇచ్చిన వేతనం చూస్తే కనీసం వారికి ఛార్జి డబ్బులు కూడా సరిపోయేవి కావని,
ఎంతగానో కష్టపడుతున్న అంగన్వాడీ టీచర్ల శ్రమను గుర్తించిన ఏకైక సిఎం కేసీఆర్ మాత్రమే అన్నారు.
ఎప్పటికప్పుడు గర్భిణీ లపై ప్రత్యేక దృష్టి పెడుతూ వారికి మంచి పోషకాహారాలను అందిస్తున్న అంగన్వాడి టీచర్లలందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గర్భిణీల పై అంగన్వాడీ టీచర్లు తీసుకుంటున్న శ్రద్ధ తల్లి ప్రేమను తలపిస్తుందని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్