కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన పాత్రికేయులు దేశిని మహేందర్ గౌడ్, వినీల్ గౌడ్ ల తండ్రి రాములు గౌడ్ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు.
విషయం తెలుసుకున్న తస్లీమా బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇలాంటి సందర్భాలోనే మనో ధైర్యంతో ఉండాలని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు ఉన్నారు.