తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏ ఎన్ ఎం లను తక్షణమే రెగ్యులర్ చేయాలని,వారికి ఉద్యోగ జీవిత భద్రత కల్పించాలని,సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గత 16వ,తేదీ నుండి నిరసన తెలుపుతున్న ఏ ఎన్ ఎం ల నిరసన దీక్ష శిబిరాన్ని గురువారం ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ సందర్శించి తమ పూర్తి మద్దతును తెలిపారు.
ఈ సందర్భంగా యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ గా మారిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి వీఆర్ఎస్ దగ్గర పడ్డదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సమాన పనికి, సమాన వేతనం ఇవ్వాలని,సెకండ్ ఏ ఎన్ ఎం లను తక్షణమే రెగ్యులర్ చేసి వారికి జీవిత భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమానికి ఏ ఐ టి యు సి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా,ఐ ఎన్ టి యు సి నాయకులు బంటు చొక్కాయ్య గౌడ్,చింతకాయల రాములు తదితరులు పాల్గొని మాట్లాడారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్