29.7 C
Hyderabad
May 2, 2024 06: 23 AM
Slider వరంగల్

వరదల్లో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం

#mulu

వరదలలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ములుగు జెడ్ పి చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి అన్నారు. ఆమె గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరదలలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముగ్గురికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద ప్రవాహ ప్రాంతాల పట్ల కేంద్రం అవలంబిస్తున్న తీరు బాధాకరమని అన్నారు.

ఈ కార్యక్రమం లో ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ హరిబాబు, ఆత్మచైర్మన్ దుర్గం రమణయ్య, చక్రపాణి మండలం అధ్యక్షులు సూరపనేని సాయిబాబా, కో ఆప్షన్ సభ్యులు ఎండీ బాబర్, ఎంపీటీసీలు స్వరూప, ఆలూరి శ్రీనివాస్, సర్పంచ్ లు సంపత్, మోహన్ రాథోడ్ ఉపసర్పంచ్ అల్లంనేని హన్మంతరావు, జిల్లా సీనియర్ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు గ్రామ కమిటీ అధ్యక్షులు వివిధ హోదలో వున్నా ప్రజాప్రతినిధులుఅధికారులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

Related posts

రూ.410 కోట్లతో మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణం

Satyam NEWS

మా అమ్మ భూమిని ధరణిలో ఎంట్రీ చేయండి

Satyam NEWS

పంచాయతీ ఎన్నికల బందోబస్తు పై విశాఖ రేంజ్ డీఐజీ సమీక్షా సమావేశం

Satyam NEWS

Leave a Comment