ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్లో భాగంగా జైలులో ఉన్నారు. మనీష్ సిసోడియాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి (హైదరాబాద్ బేస్డ్ వ్యాపారవేత్త), బినోయ్ బాబు బినోయ్ (మద్యం కంపెనీ ఎం/ఎస్ పెర్నోడ్ రికార్డ్ మేనేజర్) బెయిల్ పిటిషన్లను కూడా సోమవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే వారు చాలాసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు నిరాకరించింది. తాజాగా హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో మరోసారి వీరికి ఎదురుదెబ్బ తగిలింది.