33.2 C
Hyderabad
May 4, 2024 00: 20 AM
Slider కరీంనగర్

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి

#suspiciousdeath

నాలుగు రోజుల కిందట చేపలుపట్టేందుకు వెళ్లిన ఒక వ్యక్తి నేడు శవమై తేలాడు. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఎడ్ల మహేష్ (33) అనే వ్యక్తి గత శనివారం (24-04-2021) రోజున చేపలు పట్టేందుకు వెళ్లాడు.

ఇదే విషయాన్ని మహేష్ ఇంట్లో ఉన్న తన తండ్రి అయిన రాజయ్య కు చెప్పి వెళ్ళాడు. అయితే అతను సాయంత్రానికి తిరిగి ఇంటికి రాలేదు.

అప్పటి నుండి తన కొడుకు కోసం రాజయ్య వెతుకుతూనే ఉన్నాడు.

ఈ రోజు సంకెపల్లి శివారులో కాలువ లో ఒక మగ వ్యక్తి శవం వుందనే సమాచారం తెలుసుకున్న రాజయ్య వెళ్లి చూడగా ఆ శవం తన కొడుకుదని గుర్తించాడు.

చేపలు పట్టేందుకు కాలువ లో దిగి ప్రమాద వశాత్తు నీటిలో మునిగి చనిపోయాడని భావిస్తున్నారు.

ఈ మేరకు రాజయ్య  ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.

Related posts

‘దేశం’ తో కలిసిన వారాహీ యాత్రతో జగన్ గుండె గుభేల్

Satyam NEWS

ఇది కొత్త రాజకీయం: నైతిక విలువలకు పాతర

Satyam NEWS

ట్యాక్స్ పేయర్స్ పై కరుణ చూపిన ఆదాయపు పన్ను శాఖ

Satyam NEWS

Leave a Comment