నాలుగు రోజుల కిందట చేపలుపట్టేందుకు వెళ్లిన ఒక వ్యక్తి నేడు శవమై తేలాడు. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఎడ్ల మహేష్ (33) అనే వ్యక్తి గత శనివారం (24-04-2021) రోజున చేపలు పట్టేందుకు వెళ్లాడు.
ఇదే విషయాన్ని మహేష్ ఇంట్లో ఉన్న తన తండ్రి అయిన రాజయ్య కు చెప్పి వెళ్ళాడు. అయితే అతను సాయంత్రానికి తిరిగి ఇంటికి రాలేదు.
అప్పటి నుండి తన కొడుకు కోసం రాజయ్య వెతుకుతూనే ఉన్నాడు.
ఈ రోజు సంకెపల్లి శివారులో కాలువ లో ఒక మగ వ్యక్తి శవం వుందనే సమాచారం తెలుసుకున్న రాజయ్య వెళ్లి చూడగా ఆ శవం తన కొడుకుదని గుర్తించాడు.
చేపలు పట్టేందుకు కాలువ లో దిగి ప్రమాద వశాత్తు నీటిలో మునిగి చనిపోయాడని భావిస్తున్నారు.
ఈ మేరకు రాజయ్య ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.