ఆంధ్రప్రదేశ్లో మరో సలహాదారును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయానికి సంబంధించిన అంబటి కృష్ణారెడ్డి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు.
కడప జిల్లాకు ఎర్రగుంట్ల మండలం తిప్పలూరూ కు చెందిన అంబటి కృష్ణా రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.
అంబటి కృష్ణారెడ్డి కేబినెట్ మంత్రి స్థాయి హోదా కలిగి ఉంటారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు సంవత్సరాల పాటు ఆయన సలహాదారుగా కొనసాగుతారు.