కుమ్రం భీమ్ జిల్లా లో శాంతి భద్రతల దృష్ట్యా ప్రశాంత కాపాడేందుకు నెల రోజుల పాటు ౩౦ పోలీస్ చట్టం అమలులో ఉంటుందని రామగుండం పోలీసు కమిషనర్ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఇన్ చార్జి ఎస్ పి వి. సత్య నారాయణ ప్రకటించారు.
పోలీసు చట్టం 30 అమలులో ఉన్నందున బహిరంగ సభలు, ఊరేగింపులు, ధర్నాలు జరుపరాదని ఆయన ఆదేశించారు. నిషేధిత ఆయుధాలైన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు, ప్రేలుడు పదార్థాలు, నేరానికి పురిగోల్పే ఎటువంటి ఆయుధాలను వాడరాదని ఆయన తెలిపారు.
లౌడ్ స్పీకర్ లు, DJ లు వంటివి కూడా ఈ సమయం లో నిషేధించినట్లు, పబ్లిక్ అడ్రసింగ్ కోసం వాడే ప్రచార రథాలు మైకులు దాని అనుబంధ పరికరాలన్నీ కూడా నిషేధించారు.