సరూర్ నగర్, లింగోజీగూడా ధర్మపురి కాలనీలో 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఏరియా కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ జి.ఎస్.రాజు తదితర సభ్యులు కాలనీవాసులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ రోజు వరకు మనం అనుకున్నది సాధించాము. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణంలో సఫలీకృతులయ్యాము. ఇకపోతే మొక్కలు, సిసి కెమెరాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విన్నవించుకున్నారు. కాలనీ ప్రెసిడెంట్ జి.ఎస్.రాజు మాట్లాడుతూ అనుకున్నవన్నీ కార్పొరేటర్ మున్సిపల్, వాటర్ వర్క్స్ అధికారుల చొరవవల్ల నిర్విఘ్నంగా డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం అతిత్వరలో పూర్తి చేసుకున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ విషయంలో ఏరియా కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరరెడ్డి ని అభినందిస్తున్నాము అన్నారు. పతాక ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ముగిసింది.
previous post
next post