విశాఖలోని కాపులుప్పాడ కొండపై 30 ఎకరాలను గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్కు బదలాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీని కోసం జీవో నెంబర్ 1353ను సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసింది.
భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో గ్రేహౌండ్స్ కు కేటాయించిన 300 ఎకరాల్లో 30 ఎకరాలను ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి కేటాయించారు.
ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ జీవో జారీ చేశారు.
కాపులుప్పాడ కొండపై హైకోర్టులో విచారణ జరిగిన గంటలోనే జీవో జారీ అయింది.