సూడాన్లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ కొర్డోఫాన్ ప్రావిన్స్లో బంగారు గని కుప్పకూలడంతో కనీసం 38 మంది మరణించారు. రాజధాని ఖార్టూమ్కు దక్షిణంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫుజా గ్రామంలో మూసి ఉన్న గనిలో ప్రమాదం జరిగిందని సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రమాదంలో కొందరికి గాయాలైనట్లు సమాచారం. మైనింగ్ కంపెనీ ఫేస్బుక్లో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ ఘటనతో ఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్తులు సహాయకచర్యలు చేపట్టారు. రాజధాని ఖార్టూమ్కు దక్షిణంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫుజా గ్రామంలో మూసివేసిన గని కూలిపోయిందని దేశ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దిష్ట లెక్కలు చెప్పకుండా పెద్ద సంఖ్యలో గాయపడ్డారని పేర్కొంది.