వనపర్తి ఏటీఎం సెంటర్లో దొరికిన సొమ్మును పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడో ఓ యువకుడు.
వనపర్తి పట్టణ ఎస్ఐ. వెంకటేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి పట్టణం 9వ వార్డు, పుణ్య నాయక్ తండాకు చెందిన ఏ. జయరాం నాయక్ ఉదయం 10.39 నిమిషాలకు వనపర్తి పట్టణంలోని రామాలయం వెళ్లే దారిలో ఉన్న హెచ్ డిఎఫ్సి ఏటీఎం వద్ద డబ్బులు తీసేందుకు వెళ్ళాడు.
దీంతో అప్పటికే ఏటీఎం నుంచి బయటికి ఉన్న రూ.6 వేలు చూసి ఎవ్వరివో అని ఆరా తీశాడు. అయినప్పటి ఎవ్వరు అక్కడ లేక పోవడంతో తన స్నేహితుల ద్వారా విలేకరి లక్ష్మన్ కు సమాచారం ఇచ్చాడు.
అనంతరం వారి ద్వారా ఏటీఎంలో దొరికిన రూ.6వేలు పట్టణ ఎస్ఐ. వెంకటేష్ గౌడ్ కు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దొరికిన డబ్బులు పోలీసులకు అప్పగించిన అతన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ఆ సమయంలో ఏటీఎంలో డబ్బులు ఎవరూ తీశారో వాకబు చేసి వారికి అప్పగిస్తానని ఎస్ఐ. వెంకటేష్ గౌడ్ తెలిపారు. వివరాలకు 9440795722 నెంబర్ ను సంప్రదింఛాలని కోరారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి