ఏ పీ ఎస్ ఆ ర్టీ సీ నరసరావుపేట డిపో లో శిక్షణ పొందిన డ్రైవర్లకు నేడు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది. గుంటూరు డిప్యూటీ సి ఎం ఈ జి శరత్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న 16 మంది డ్రైవర్లకు సర్టిఫికెట్లు అందచేశారు.
హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ ఇది. ఈ సందర్భంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి శరత్ బాబు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఇంచార్జ్ డిప్యూటీ సి టి యమ్ ఆర్ ఎం నాయక్, వినుకొండ డిపో మేనేజర్ హనుమంతురావు, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్, నరసరావుపేట డిపో మేనేజర్ ఎస్ కె అబ్దుల్ సలామ్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్యారేజి ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఇంచార్జి శ్రీనివాసరావు, ట్రైనర్ సి హెచ్ మోహన రెడ్డి, పీ బోల్లయ్య పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.