అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డులు ఇప్పిస్తామని, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆయన ఛాంబర్లు జిల్లా అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందజేయాలని అక్రిడేషన్ కమిటీ అధికారి అంజిలప్ప ను ఆదేశించారు.
కమిటీ సభ్యులు అబ్దుల్లా, కమిటీ సభ్యులు వెంకట్ స్వామి, సురేష్, పరిపూర్ణం, సుదర్శన్ రెడ్డి, కమిటీ సభ్యులు నాగర్ కర్నూల్ పట్టణంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాన్ని ప్రభుత్వ పరంగా అందజేయాలని కలెక్టర్ ఎల్. శర్మన్ కు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తరువాత వెంటనే ఆ స్థలాన్ని పరిశీలించి జర్నలిస్టులకు కేటాయిస్తామని జిల్లా పరిధిలోని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అంజిలప్ప, సీనియర్ పాత్రికేయులు అక్రిడేషన్ కమిటీ సభ్యులు అబ్దుల్లా, పరిపూర్ణం, సురేష్, వెంకటస్వామి, దినకర్, విజయ్, సుదర్శన్ రెడ్డి, రాజు పాల్గొన్నారు.