జాతీయ ఓబిసి లిస్టులో ఆరె కులస్తులను చేర్చకపోవడంతో వారికి తీరని నష్టం వాటిల్లుతున్నదని కొమరం బీమ్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు.
ఈ మేరకు నేడు ఆయన హైదరాబాదులో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఐఐటీ, ఎన్ఐటీ, ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు, రైల్వేలు, పోస్టల్ డిపార్ట్మెంట్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగార్థులుగా ఉన్న ఆరె కులస్తులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన అన్నారు.
ఆరె కుల పెద్దలు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తల్లోజు ఆచారి హామీ ఇచ్చారు.
తల్లోజు ఆచారిని నేడు కలిసిన వారిలో కొమురం భీం జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు చప్పిడి సత్తెన్న,టీచర్లు డోకె దామోదర్,నరసింహారావు, సాయిరి తిరుపతి, నాయకులు చన్కపురే గణపతి, జుంగరి మధుకర్,లోనారి రవీందర్ తదితరులు ఉన్నారు.