భద్రాచలం దేవస్థానం ఈఓగా విధులు నిర్వహించే అవకాశం రావడం ఎంతో అదృష్టమని దేవుని సేవ చేసే భాగ్యం కలాగడం చాలా సంతోషమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. దేవస్థానం ఈఓగా పదవీ భాద్యతలు చేపట్టిన రమాదేవి ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ను మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి, పుష్కర పట్టాభిషేక మహెూత్సవాలు వైభవంగా నిర్వహించుటకు చర్యలు చేపట్టాలని చెప్పారు. చేపట్టాల్సిన పనుల యొక్క టెండరు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని ఎలాంటి లోటుపాట్లు రాకుండా పకడ్బంది ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలు అందించి స్వామి వారి ఆశీర్వచనాలు, ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. అనంతరం స్వామి వారి ప్రసాదాలు అందచేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు పొడిచేటి పాండురంగాచార్యులు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.