28.7 C
Hyderabad
May 5, 2024 23: 35 PM
Slider మెదక్

తెలంగాణ ద్రోహులను మోస్తున్న కాంగ్రెస్ బీజేపీ

#Harish

పిల్లిని సంకల పెట్టుకున్నట్లు తెలంగాణ ద్రోహులైన మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు మోస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ ధ్వజమెత్తారు. బీజేపీ కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆంధ్రా నాయకుల చెప్పులు మోయడానికా.. అంటూ తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారో చెప్పాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలను మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు.

సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం మంగోల్ గ్రామంలో నూతన గ్రామ పంచాయితీ భవనం, మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో ఉచిత కరెంటు పేరిట ఉత్త-దొంగ కరెంటు వచ్చేదని ఎద్దేవా చేశారు. బీజేపీ మూడు చట్టాలు తెచ్చి రైతులను బలి తీసుకున్నదని విమర్శించారు.

కేసీఆర్ రైతులకు మూడు-3 పంటలు కావాలని అడిగితే తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటలు కరెంటు వద్దని, 3 గంటలు చాలని అనడంలో ఆంతర్యమేంటనీ ప్రశ్నించారు. అంతకు ముందు మంగోల్ నూతన గ్రామ పంచాయతీ, మహిళా భవనం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉన్నదని, గ్రామాన్ని రూ.19 కోట్లతో వివిధ కుల సంఘాలు, చెరువులు, రహదారి నిర్మాణ అభివృద్ధి చేసుకున్నామని వివరించారు.

Related posts

ఆర్టీసి ప్రయాణికులు కు గుడ్ న్యూస్

Bhavani

విద్యా శాఖలో ఢిల్లీ తరహా విధానం

Bhavani

కరోనా శ్రామికులకు నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment