33.2 C
Hyderabad
May 4, 2024 02: 10 AM
Slider వరంగల్

కేటీఆర్ ను కలిసిన అరూరి

#KTR

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి&పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వరంగల్ నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని మంత్రికి వివరించారు.

ముఖ్యంగా వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలు, అనేక కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరద నీటితో రోడ్లు, డ్రైన్లు దెబ్బతిన్నాయని వాటి మరమ్మతులకు నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ని కోరారు.

అలాగే నూతనంగా ఏర్పడిన వర్దన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్ త్వరలోనే అవసరమైన నిధులను మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Related posts

కరోనా నుంచి కోలుకున్న బిజెపి నాయకుడు

Satyam NEWS

ఎంపీ బిబిపాటిల్ చొరవతో రెండు రోజుల్లో స్వగ్రామానికి మృతదేహం

Bhavani

విద్యాశాఖ మంత్రి దృష్టికి టీచర్ల సమస్యలు

Satyam NEWS

Leave a Comment