కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న బిజెపి కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ నేడు కార్యాలయానికి విచ్చేశారు.
ఇటీవల కరోడ్ సోకి మళ్లీ నెగెటివ్ రావడంతో ఈ రోజు మొదటిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు రాజేందర్, జిల్లా బిజెపి నాయకులు పొన్నం నారాయణగౌడ్ తోట సత్యనారాయణ దావా సాయన్న రావుల రాము తదితరులు స్వాగతం చెప్పి పూలమాలలతో సత్కరించారు.
ముఖ్యంగా కరోనా ను జయించడంలో మనోధైర్యంతో పాటు కార్యకర్తలు ఆదరాభిమానాలు ఎంతో ఉపకరించాయని రావుల రామ్నాథ్ పేర్కొన్నారు.
ఈ అభిమానం కలకాలం ఉండాలని రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి తాను మరింత కష్టపడతానని వెల్లడించారు.