అనుకున్నట్లుగా నే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో అధికార వైఎస్సార్సీపీ దూసుకెళుతోంది. విజయనగరం కార్పొరేషన్ లో మేయర్ అభ్యర్థి నిగా బీసీ మహిళ కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపు లో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు భార్య సుజాత..17 విర్డు నుంచీ గెలుపొంది… మేయర్ పట్టాన్ని కైవసం చేసుకునే దిశగా ఉన్నారు.అటు మిగిలిన మున్సిపాలిటీ లలో నూ అధికార పార్టీ విజయఢంకా మోగిస్తోంది.
ఇక విజయనగరంలో 13వ వార్డు వైఎస్సారెస్పీ అభ్యర్థి ని ఇసరపు రేవతి దేవీ 602 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు.అలాగే 34వ వార్డు వైఎస్సారెస్పీ అభ్యర్థి ని బాలి పైడిరాజు 1106 ఓట్లతో ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ని రాజపాత్రుని దన లక్ష్మీ పై గెలుపొందారు.ఇక విజయనగరం..నెల్లిమర్ల నగర పంచాయతిని వైఎస్సారెస్పీ కైవసం చేసుకుంది.20 వార్డులలో కౌంటింగ్ పూర్తవ్వగా 11 వార్డులలో వైఎస్సార్సీపీ గెలుపొందగా, 7 వార్డులలో టీడీపీ గెలుపొందగా , ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు.