శామీర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు మృతి చెందారు.
గజ్వేల్ నుండి వస్తున్న కారు శామీర్ పేట్ ఔటర్ ఎక్కిన కొద్ది దూరంలోనే వెళ్తున్న ఆగి ఉన్న కంటేనర్ ను ఢీ కొన్నది.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు చిలుకానగర్ కు చెందిన సంధ్య, సరళ సహా కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడిక్కక్కడే మృతి చెందారు.
కారు గజ్వేల్ నుండి ఉప్పల్ చిలుకనగర్ కు వెళ్తున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.