మంజూరై 3 నెలలు గడుస్తున్నా రోడ్డు వేయకపోవడంతో ఉప్పల్ ప్రాంతంలోని అన్నపూర్ణ కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపికి చెందిన ఒక కాంట్రాక్టర్ 47 లక్షల రూపాయల రోడ్డు కాంట్రాక్టు పనులను దక్కించుకున్నాడు. అయితే అతను పనులు ప్రారంభించకపోవడంతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేటర్ కమిషన్ల కొరకు పనులు ఆపారని బిజెపి నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు చెక్ పెడుతూ ఎదురు లక్ష రూపాయలు కాంట్రాక్టర్ కు ఇచ్చి రోడ్డు పనులు ప్రారంభించేలా చూడాలని నాచారం డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ శాంతి సాయిజెన్ శేఖర్ డిమాండ్ చేశారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా