రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో అధికార పార్టీ విజయఢంకా మోగిస్తోంది. విజయనగరం జిల్లాలో మూడు మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్ లోనూ వైఎస్సార్సీపీ విజయ బావుటా ఎగుర వేసింది.
ప్రధానంగా ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్.. విజయనగరం ఎమ్మెల్యే కూతురు 29 వ వార్డు నుంచీ గెలుపొందడంతో..స్థానిక మంత్రి ఇమేజ్ కాస్త తగ్గినట్టే.
ఇదిలా ఉంటే సాయంత్రం 6 దాటినా ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడలేదు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ని జిల్లా పోలీసు శాఖ డ్రోన్ కెమరాతో పరిశీలించారు