37.2 C
Hyderabad
May 6, 2024 11: 15 AM
Slider జాతీయం

లఖీమ్‌పూర్‌ కేసులో ఆశిష్‌ మిశ్రాకు 3రోజుల పోలీస్‌ కస్టడీ

లఖీమ్‌పూర్‌ ఖేరి హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌కు కోర్టు 3రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. ఈనెల 3న జరిగిన ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్‌ మిశ్రాను పోలీసులు 14 రోజుల రిమాండ్‌ కోరగా.. కేవలం 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.

లఖీమ్‌పూర్‌ ఖేరిలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంతిమ్‌ అర్థాస్‌  జరుపుతామని సంయుక్త కిసాన్‌ మోర్చా తెలిపింది. అసువులు బాసిన రైతులకు నివాళులర్పించేందుకు షహీద్‌ కిసాన్‌ దివస్‌గా పాటించాలని పిలుపునిచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో దేశవ్యాప్తంగా రైతులు తమ నివాసాల వెలుపల కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని కోరింది.

ఇదిలా ఉండగా, లఖీమ్‌పూర్‌ఖేరి బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగాలంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ లక్నోలో జీపీవో పార్కు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు.

Related posts

డిసెంబ‌ర్-1 నుంచి పశువులకు మందులు

Sub Editor

మానవత్వంతో స్పందించిన ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ రివార్డు

Satyam NEWS

నేడు ఆఖరి పనిదినాన్ని ముగించుకున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా

Satyam NEWS

Leave a Comment