లారీలో రంగుల డబ్బాల మాటున మద్యం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మొత్తం రూ.42 లక్షల విలువైన మద్యం సీసాలను, రంగుల డబ్బాలను ఎస్ ఈ బీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో రంగుల డబ్బాలతో వెళుతున్న లారీలో అక్రమ మద్యం తరలిస్తున్నారని సమాచారంతో ఎస్ఈబి అధికారులు దాడులు నిర్వహించారు.
గోవా నుంచి గుంటూరు జిల్లా పొత్తూరు కు రంగుల డబ్బాల మధ్యలో పెట్టుకుని 1200ల మద్యం సీసాలు తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యం సీసాల తో పాటు రంగులు, లారీ తో కలిపి మొత్తం రూ 42 లక్షలు సొత్తు స్వాధీనం చేసుకున్నారు.