ములుగు మాజీ పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్ తల్లి కొమరమ్మ ఇటీవల మృతి చెందారు. తల్లి మరణించిన బాధలో ఉన్న ఆయనను ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ నేడు పరామర్శించారు.
ములుగు మండలం లోని జంగాలపల్లి గ్రామానికి వెళ్లిన ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ అశోక్ గౌడ్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోరిక గోవింద నాయక్, ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ములుగు జడ్పిటిసి సకినాల భవాని, అధికార ప్రతినిధి బుడతనపల్లి మోహన్ తదితరులు ఉన్నారు.