అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జీహెచ్ఎంసీ మరియు వాటర్ వర్క్స్ & SB అధికారులతో అంబర్ పేట నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వివిధ బస్తీలు, కాలనీల్లో పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలు దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులతో చర్చించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
జీహెచ్ఎంసీ మరియు వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఈ పేరిరాజు, డీఈ ప్రవీణ్, డీఈ రఘు, హెచ్ ఎం వర్క్ ఎస్ ఎస్బి & ఎస్బి డీజీఎం సన్యాసి రావు, విష్ణువర్ధన్, ఏఈ లు మరియు వర్క్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్