గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన ఫొనుగంటి నగేష్ ఇల్లు కాలిపోయింది.
ఈ సంఘటన విన్న ఏటూరునాగారం ఏ ఎస్ పి గౌష్ ఆలం బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో ఐదు వేల రూపాయల నగదు, రెండు క్వింటాళ్ల బియ్యం, నెలకు సరిపడా ఇతర నిత్యావసరాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎస్పీ తో ఏటూరునాగారం సిఐ కిరణ్, మంగపేట ఎస్సై తాహెర్ బాబా సిబ్బంది పాల్గొన్నారు.