సోషల్ మీడియా కదం తొక్కుతున్న సమయంలో న్యూస్ క్షణాలలో చేరేవేసేందుకూ దాదాపు అంతటా ఆన్ లైన్ న్యూస్ లతో శరవేగంగా దూసుకెళుతున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం దక్షిణ కోస్తా ,ఆంధ్రా లో వర్షాలు పడతాయని ఆన్ లైన్ సైట్ సత్యం న్యూస్. నెట్ వెల్లడించింది.
చెప్పిన విధంగా ఏపీ రాష్ట్రం అందున ఉత్తరాంధ్ర లో ఆకాశాన్ని నల్లటి మబ్బులు కమ్మేసాయి.
అంతవరకూ మూడు జిల్లాల ప్రజలకు ఉక్క పోత ,ఎండ తీవ్రతతో అల్లాడి పోయిన ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం కలిగింది.
మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో భగభగమండే భానుడుని మబ్బులు కమ్మేసాయి. దీంతో ఆకాశం మొత్తం చీకటి గా మారిపోయింది.
దాదాపు గంట సేపు వాతావరణ పరిస్థితి అలానే ఉంది.మరోవైపు ఆకాశంలో ఉరుములు పెళ ,పెళమంటూ శభ్థాలతో అల్లాడిపోయింది.
దీనికి తోడు గాలలు వీయడం మెల్లమెల్లగా ప్రారంభమైంది. దాంతో వర్షం మొదలైంది.