మతి స్థిమితం లేని వారిని ఎవరైనా సరే సానుభూతితో చూస్తారు. ఏమైనా సాయం కావాలంటే అడగకుండానే చేస్తారు. అయితే కొందరు దుర్మార్గులు మాత్రం మతిస్థిమితం లేని ఒక యువతిపై అత్యాచారం చేశారు. అదీ కూడా…….. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఈ దారుణం చోటు చేసుకున్నది. మతి స్థిమితం లేని 20 ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి రావడంతో సభ్య సమాజం ముక్కున వేలేసుకున్నది.
నిందితుడు ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగిగా గుర్తించారు. యువతి మతిస్థిమితం లేకపోవడంతో ఆ యువతిని తల్లిదండ్రులు ప్రయివేటగా చదివిస్తున్నారు. ఇది గమనించిన ఆ దుర్మార్గుడు 19న ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. ఆపైన అత్యాచారం చేశాడు. ఆమె పుస్తకంలో ఫోన్ నెంబర్ ఆధారంగా తల్లితండ్రులు ఈ విషయం తెలుసుకున్నారు. విజయవాడ సిటీ లోని నున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఏ మాత్రం స్పందించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.