35.2 C
Hyderabad
April 30, 2024 23: 23 PM
Slider కృష్ణ

మతి స్థిమితం లేని యువతిపై ఆసుపత్రిలో అత్యాచారం

#vijayawadapolice

మతి స్థిమితం లేని వారిని ఎవరైనా సరే సానుభూతితో చూస్తారు. ఏమైనా సాయం కావాలంటే అడగకుండానే చేస్తారు. అయితే కొందరు దుర్మార్గులు మాత్రం మతిస్థిమితం లేని ఒక యువతిపై అత్యాచారం చేశారు. అదీ కూడా…….. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఈ దారుణం చోటు చేసుకున్నది. మతి స్థిమితం లేని 20 ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి రావడంతో సభ్య సమాజం ముక్కున వేలేసుకున్నది.

నిందితుడు ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగిగా గుర్తించారు. యువతి మతిస్థిమితం లేకపోవడంతో ఆ యువతిని తల్లిదండ్రులు ప్రయివేటగా చదివిస్తున్నారు. ఇది గమనించిన ఆ దుర్మార్గుడు 19న ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. ఆపైన అత్యాచారం చేశాడు. ఆమె పుస్తకంలో ఫోన్ నెంబర్ ఆధారంగా తల్లితండ్రులు ఈ విషయం తెలుసుకున్నారు. విజయవాడ సిటీ లోని నున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఏ మాత్రం స్పందించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Related posts

అధికారి చేసిన పనితో సమగ్ర శిక్ష బోధకులకు అన్యాయం

Satyam NEWS

లెజెండ్ ను కోల్పోయిన సినీ పరిశ్రమ

Murali Krishna

కరోనా రోగుల్ని దోచుకున్న డెక్కన్ ఆస్పత్రిపై చర్యలు

Satyam NEWS

Leave a Comment