జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూకట్పల్లి ఫోరమ్మాల్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
మంత్రి పువ్వాడ అజయ్ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు. ఓ టీఆర్ఎస్ కార్యకర్తపై బిజెపి కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
మంత్రి కాన్వాయ్ను వెంబడించి కారు అద్దాలు ధ్వంసం చేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బిజెపి కార్యకర్తలను చెదరగొట్టారు.