40.2 C
Hyderabad
May 2, 2024 16: 19 PM
Slider తూర్పుగోదావరి

కాకినాడ జిల్లాలో గుండాట శిబిరాలపై దాడులు

#Gundata camps

కాకినాడ జిల్లా వ్యాప్తంగా జూదం, గుండాట శిబిరాలపై సోమవారం పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రవీంద్ర నాద్ అదేశాల మేరకు అన్నవరం పోలీసులు కత్తిపూడి,అన్నవరం,శంకవరం, రౌతాలపూడి గ్రామాల పరిధిలో గుండాట, జూద శిబిరాలు ఏర్పాటు నిర్వహించారన్న సమాచారంతో అన్నవరం పోలీసులు రెండు విభాగాలు ఏర్పడి తనిఖీలు నిర్వహించి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఎస్సై పి.శోభన్ కుమార్ ఆయన బృదంతో కత్తిపూడి, అన్నవరం పరిధిలో దాడులు నిర్వహించి నిర్వాహకులను అదుపులోకి తీసుకుని శిబిరాలను తొలగించి నిర్వహకులను స్టేషన్ కు తరలించారు. అలాగే అదనపు ఎస్సై అజయ్ బాబు రౌతలపూడి,శంకవరం పరిధిలో తనిఖీలు నిర్వహించగా రెండు ప్రాంతాలలో కోడి పందెలా నిర్వహకుల నుండి నాగులు కత్తులతో సహా కోడి పుంజులు,నగదును రూ/-1020నగదును స్వాధీనం చేసుకోగా,రెండు గ్రామాల పరిధిలో గుండాట నిర్వహకుల నుండి రూ/- 1160 నగదును స్వాధీనం చేసుకొని వారిని స్టేషన్ కు తరలించారు..

అనంతరం బోర్డులను శిబిరాలను తొలగించి నిర్వహకులపై కేసులు నమోదు చేశామని ఎస్సై శోభన్ కుమార్ తెలిపారు. శిబిరాల సమీపంలో అత్యవసర జనరేటర్ కూడా ఉండడంతో నిర్వాహకులు రాత్రి వేళ కూడా ఆటను కొనసాగించుటకు వాటిని ఏర్పాటు చేశారా లేదా అన్నది విచారిస్తున్నారు. నిర్వహకుల నుండి మొబైల్స్ మరియు వాహనాలు స్వాధీన పరుచుకున్నారా లేదా అని తెలియాల్సి ఉంది.

Related posts

హెల్ప్డ్ బట్:కూలిన కెనడా విమానం ముగ్గురు మృతి

Satyam NEWS

తాజ్‌మహల్‌ను తాకిన యమన

Bhavani

నాయకులు ఆక్రమించకుండా కొల్లాపూర్ పీజీ కాలేజ్ స్థలం కాపాడండి

Satyam NEWS

Leave a Comment