33.2 C
Hyderabad
May 4, 2024 00: 20 AM
Slider జాతీయం

ఎటాక్: కేరళ బీజేపీ కార్యదర్శి పై మసీదులోనే దాడి

attck on bjp state secretery in kerala

అగంతకులు ప్రార్థన స్థలమని చూడకుండా దాడిచేశారు.కేరళ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఏకే నజీర్‌పై ఆగంతకుల దాడి జరిగింది. సీఏఏపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఇడుక్కి జిల్లా నేడుంగడం వద్ద తూక్కుపాలెం మసీదుకు వెళ్లారు. నమాజు చేస్తున్న ఆయన్ను కొందరు వ్యక్తులు వెనుక నుంచి కుర్చీతో కొట్టారని, కాళ్లతో తన్నారని బీజేపీ తెలిపింది.

గాయపడిన నజీర్‌ను చికిత్స కోసం ముందుగా స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి కోచిలోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు తరలించామని తెలిపారు. ఈ దాడికి సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, సీపీఎం అనుబంధ డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యకర్తలే కారణమని బీజేపీ ఆరోపించింది. కాగా, మసీదులో నజీర్‌పై జరిగిన దాడికి కారకులెవరో తెలియడం లేదని డీఎస్‌పీ రాజమోహన్‌ తెలిపారు.

Related posts

మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పాలాభిషేకం

Satyam NEWS

కొమురవెల్లి మల్లన్నకు బంగారు మీసాలు సమర్పించిన మంత్రి అల్లోల

Satyam NEWS

అద్వితీయుడు, క్రికెట్ ధీరుడు ధోనీ

Satyam NEWS

Leave a Comment