27.7 C
Hyderabad
May 4, 2024 08: 37 AM
Slider చిత్తూరు

తిరుపతి రవాణా విభాగం లో వేడుకగా ఆయుధ పూజ

#tirumala

టీటీడీ  రవాణా విభాగం లో  శుక్రవారం ఆయుధపూజ వేడుకగా నిర్వహించారు. ఈవో  ఎవి ధర్మారెడ్డి , జేఈవో లు  సదా భార్గవి, వీర బ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ట్రాన్స్పోర్ట్  కార్యాలయం వద్దకు చేరుకున్న ఈవో కు ఆ విభాగాధిపతి శేషారెడ్డి  ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆయుధ పూజలో పాల్గొన్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించిన అనంతరం జిఎం శేషారెడ్డి ఈవో , జేఈవో లు ,సివిఎస్వో ను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్బంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా  ఉద్యోగులందరూ క్షేమంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ప్రతి ఏటా దీపావళి ముందు ఆయుధపూజ నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆయుధ పూజ చేశామని ఆయన తెలిపారు. ట్రాన్స్ పోర్ట్  ఎ ఎం ఎఫ్  లక్ష్మీ ప్రసన్న, డి ఐ మోహన్ తో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts

ఆరుగురు ఐటి/ కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు

Satyam NEWS

వ‌చ్చే నెల 4 నుంచి వెంక‌న్న ఆల‌య పునః ప్రతిష్ఠా మహోత్స‌వం

Satyam NEWS

అసమ్మతికి ఆజ్యం: వనపర్తిలో జూపల్లి సమాలోచనలు

Satyam NEWS

Leave a Comment