ములుగు మేయర్ గ్రామ పంచాయతీ లో జరిగిన అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని బిజెపి ములుగు మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ డిమాండ్ చేశారు.
గత రెండు సంవత్సరాలుగా ములుగు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన నిధుల వినియోగంపై ఆడిట్ చేయాలని, బినామీ పేర్లతో సరైన నాణ్యత విలువలు పాటించకుండా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
డిమాండ్ల సాధనకు బుధవారం రోజున గ్రామపంచాయతీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో భారతీయ జనతాపార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి నగర్ రమేష్, కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్,యువమోర్చ జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్, మండల ప్రధాన కార్యదర్శి కోయిల కవిరాజ్, యువమోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి, యువ మోర్చా నాయకులు సానికొమ్ము హరీష్ రెడ్డి, గుమ్మాడెల్లి లక్ష్మణ్ పాల్గొన్నారు.