కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను తహసీల్దార్ పి.ఆనంద్ కుమార్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం నిరుపేద కుటుంబసభ్యులకు ఎంతగానో ఆసరాగా ఉంటోందన్నారు.
ప్రతి ఒక్కరూ కళ్యాణలక్ష్మి పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ తో పాటు నాయబ్ తహసీల్దార్ మునీరుద్దీన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా,సీనియర్ సహాయకులు రాచప్ప, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఉన్నారు.