కరోనా వ్యాప్తిపై స్థానికంగా ఉండే ఆర్ఎంపి, పిఎంపి డాక్టర్లకు అవగాహన కల్పించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ వెంకట దాస్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మహా బూబ్ ఫంక్షన్ హల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సి ఐ బి.వెంకట్ రెడ్డి, ఎసై కొంపల్లి మురళి గౌడ్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కరోనా వ్యాప్తి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సమావేశంలో వివరించారు.
కరోనా వ్యాప్తిని ఎవరూ కూడా ఆషామాషీగా తీసుకోవద్దని, ముఖ్యంగా ఆర్ఎంపి డాక్టర్లు తమ వద్దకు వచ్చిన రోగులకు కరోనా లక్షణాలు ఉన్నాయోలేదో ముందుగా పరీక్షించుకోవాలని వారు తెలిపారు. గ్రామీణ డాక్టర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందని వారు వివరించారు.