ఆస్తిపన్ను చెల్లించేవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. కల్వకుర్తి పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించే వారి కి 90 శాతం వడ్డీ మాఫీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలో ఆస్తి పన్ను బకాయిల కోసం ఓ టి ఎస్ పథకాన్ని ప్రారంభించింది.
వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద ప్రాపర్టీ టాక్స్ కేవలం 2019-2020 ఆస్తిపన్ను 10 శాతం వడ్డీ కడితే సరిపోతుందని మిగతా 90 శాతం వడ్డీ మాఫీ చేయబడుతుందని ఆయన తెలిపారు.
తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ తేదీ 28/07/2020 జీవో నెంబర్ 306 ద్వారా ఆస్తిపన్ను 90% పేరుకుపోయిన మొత్తం10% శాతం వడ్డీతో చెల్లించే వెసులుబాటు ఏర్పాటు చేశారని, పట్టణంలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలను చెల్లించేందుకు, వారిని ప్రోత్సహించడానికి ఆస్తిపన్ను వన్ టైమ్ స్కీమ్ క్రింద రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆస్తిపన్నుపై 90% పేరుకుపోయిన బకాయి వడ్డీని ప్రభుత్వం మాఫీ చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఆస్తి పన్ను చెల్లింపుదారులు 2019/20 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిల మొత్తాన్ని క్లియర్ చేస్తే, 10% వడ్డీతో “వన్ టైమ్ స్కీమ్ క్రింద చెల్లించవలసి ఉంటుందని, ఆస్తిపన్ను వన్ టైమ్ సెటిల్మెంట్ మొదలు 01/08/2020 నుండి తేదీ 15/09/2020 వరకు ముగుస్తుంది. కాల వ్యవధి 45 రోజులు ఉంటుందన్నారు.
కల్వకుర్తి పట్టణ గృహ వినియోగదారులు మరియు వాణిజ్య వినియోగదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.