39.2 C
Hyderabad
April 28, 2024 12: 25 PM
Slider కడప

దౌర్జన్యంతో గెలవాలని చూస్తున్న వైసీపీ

దాడులకు దౌర్జన్యానికి పాల్పడి వైసీపీ నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని టీడిపి పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థి భూమిరెడ్డి రాం భూపాల్ రెడ్డి, హరి ప్రసాద్ అన్నారు. కడప నగరంలోని వైఎస్సార్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశం నిర్వహించారు. దైర్యం ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని వారన్నారు. అయితే వైసీపీ నేతల ఆటలు సాగనివ్వమని వారన్నారు. పట్టభద్రులను ప్రలోభాలకు, బెదిరింపులకు లోను చేయడం సరికాదని వారు తెలిపారు. అనుకూలంగా ఓటు వేయకపోతే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించడమేమిటని వారు వైసీపీ నేతలను నిలదీశారు. ఓట్లు నమోదు చేసుకోకపోతే పథకాలను రద్దు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

Related posts

పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

శ్రీరామనవమికి గోల్నాకలో ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

టీఎస్ఎఫ్సీఓఎఫ్‌కు ప్ర‌థ‌మ బ‌హుమ‌తి

Sub Editor

Leave a Comment