సూర్యా పేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలంలో ఎంపిపి మూడవతు పార్వతికొండానాయక్ అధ్యక్షతన సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సమీక్షా సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపిపి,జెడ్పీటీసీలు మాట్లాడుతూ గ్రామాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని,మురికి కాలువలో చెత్త చెదారం తొలగించి నీరు సక్రమంగా పారే విధంగా చేసుకొని,దోమలు వృద్ధి చెందకుండా చూడాలని,ప్రజలందరికీ పరిశుభ్రమైన నీరు సరఫరా అయ్యేటట్లు చూసి,ప్రజలందరూ అంటూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జానకి రాములు,ఎంపిఓ ఆంజనేయులు,డాక్టర్ ఫిరోజ్ ఖాన్,కార్యదర్శులు,ఎఎన్ఎమ్ లు, ఆశా వర్కర్లు,అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్