దీన్దయాళ్ ఉపాధ్యాయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని, పార్టీ కార్యకర్తలు మరింత సేవాదృక్పదంతో కార్యక్రమాలు చేయాలని హెచ్బికాలని బిజేపీ డివిజన్ ప్రెసిడెంట్ ఏనుముల మహేష్కుమార్ అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ అన్నపూర్ణ కాలని, పంచముఖి దేవస్థానం నందు పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్బంగా సేవా సమర్పణ అభియాన్లో బాగంగా బిజేపీ డివిజన్ ప్రెసిడెంట్ ఏనుముల మహేష్కుమార్, ప్రధాన కార్యదర్శి గోపు రాజేశ్వర్ లు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పార్టీ రాజకీయ సిద్దాంతం ఏకాత్మతా మానవతా వాదాన్ని రూపొందింంచడంలోను, పార్టీని దేశమంతటా విస్తరించడంలో ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో భ్రహ్మచారి, రామ్ప్రదీప్, నరసింహరావు, శశికళ, మమత, అపర్ణ, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్, సత్యం న్యూస్