భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను చంపేస్తానని బెదిరించిన ఖాదీమ్ సల్మాన్ చిస్తీని అజ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్మీర్ పోలీసులు అర్థరాత్రి ఈ చర్య తీసుకున్నారు. బెదిరింపు వీడియో వైరల్ కావడంతో సల్మాన్ చిస్తీ పరారీలో ఉన్నాడు.
సల్మాన్ చిస్తీ అరెస్టును ఏఎస్పీ వికాస్ సంగ్వాన్ ధృవీకరించారు. దర్గా ఖాదీమ్ సల్మాన్ చిస్తీ ద్వారా తప్పుదోవ పట్టించే, అభ్యంతరకరమైన వీడియోను ఉంచినట్లు తమకు సమాచారం అందిందని ఏఎస్సీ తెలిపారు. ఆ తర్వాత ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
సల్మాన్ చిస్తీని తన ఇంటి నుంచి పట్టుకున్నట్లు చెప్పారు. కేసు విచారణ కొనసాగుతోంది. నూపుర్ శర్మ పై ఆయన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మద్యం మత్తులో సల్మాన్ చిస్తీ ఈ వీడియో చేసినట్లు తెలుస్తోందని పోలీసు అధికారి తెలిపారు.
చిస్తీపై ఇప్పటికే 13 కేసులు
సల్మాన్ చిస్తీ ఇప్పటికే రౌడఅ షీటర్. అతనిపై 13 కేసులు నమోదయ్యాయి. ఇతను పేరుమోసిన మోసగాడు. దర్గాకు చెందిన ఖాదీమ్ సల్మాన్ చిస్తీ రెండు నిమిషాల యాభై సెకన్ల వీడియోలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను చంపేస్తానని బెదిరించాడు.
ఆ వీడియోలో ‘ నాకు జన్మనిచ్చిన మా అమ్మపై ప్రమాణం చేస్తున్నాను, ఆమెను బహిరంగంగా కాల్చివేస్తాను, నా పిల్లలపై ప్రమాణం చేస్తాను, నేను ఆమెను కాల్చివేస్తాను. ఈ రోజు కూడా నూపుర్ శర్మ మెడను కోసి ఎవరు తీసుకువస్తే, నేను అతనికి నా ఇల్లు ఇచ్చేస్తాను అని సల్మాన్ చెప్పాడు.
ఇంకా వీడియోలో, అతను తనను తాను ఖ్వాజా నిజమైన సైనికుడిగా అభివర్ణించుకున్నాడు. వైరల్ అవుతున్న వీడియోలో సల్మాన్ ముస్లింలను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. జూన్ 17న గరీబ్ నవాజ్ దర్గా వెలుపలి నుండి తీసిన నిశ్శబ్ద ఊరేగింపులో దర్గాకు చెందిన ఖాదీమ్ గౌహర్ చిస్తీ కూడా రెచ్చగొట్టే ప్రసంగం చేశారని తెలిసింది.
ఉదయ్పూర్లో కన్హయ్య లాల్ హత్యకు గురైన తర్వాత “గుస్తఖ్-ఏ-రసూల్ కీ యేహీ శిక్ష, సర్ తన్ సే జుడా, సార్ తన్ సే జుడా” అనే నినాదం ఎక్కువ అయింది.